మదనపల్లిలో జనసేన-టిడిపి ఉమ్మడి ప్రచారం

మదనపల్లి మండలం, కురువంక పంచాయతీలోని భువనేశ్వరి నగర్ లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీరామ రామాంజనేయులు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున శ్రీరామ రామాంజనేయులు మరియు దారం అనిత, దారం హరిప్రసాద్ తులసి శ్రీనివాసులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, గుణం, బీసీ సంఘం నాయకులు వెంకటేష్, చంద్రశేఖర్, గణేష్, లక్ష్మి తెలుగుదేశం పార్టీ తరఫునుంచి కురవ వంక మాజీ సర్పంచ్ పసుపులేటి మోహన్ ఈశ్వర, మహమ్మద్ తెలుగుదేశం పంచాయతీ క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ మరియు పెద్ద ఎత్తున జనసైనికులు వీర మహిళలు పాల్గొని ఎంత ఉత్సాహంగా ఇంటింటికి ఉమ్మడి కార్యాచరణను ప్రజలకు వివరించారు.