జనసేన – టీడీపీ ఉమ్మడి సమన్వయ సమావేశం

తాడిపత్రి నియోజకవర్గం: తాడిపత్రి, జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సమన్వయ సమావేశాల్లో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలో తొలి సమావేశం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జె సి అష్మిత్ రెడ్డిల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించడం జరీగింది. రెండు పార్టీల నాయకులు కలిసి సంయుక్త కార్యాచరణ రూపొందించుకునేందుకు జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, ఐటీ సభ్యులు మరియు అన్ని గ్రామాలకు సంబంధించిన జనసైనికులు పాల్గొనడం జరిగింది.