గోళ్ళాపురం గ్రామంలో జనసేన-తెలుగుదేశం సమన్వయ సమావేశం

హిందూపురం, తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు హిందూపురం గోళ్ళాపురం గ్రామంలో తెలుగుదేశం మరియు జనసేన సమన్వయ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. రెండు పార్టీలు ఐక్య కార్యాచరణతో కలిసికట్టుగా ముందుకెళ్లి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుచేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.