జనసైనికుడికి అండగా నేనున్నాను: బొర్రా

సత్తెనపల్లి, నకరికల్లు మండలం నకరికల్లు గ్రామంలో అనారోగ్యం పాలైన జనసైనికుడు శంకర్ ను జనసేన సత్తనపల్లి నియోజకవర్గ జనసేన-టిడిపి సంప్రదింపుల సమన్వయ బాద్యులు బొర్రా వెంకట అప్పారావు పరామర్శించడం జరిగింది. అనారోగ్యం బారిన పడిన జనసైనికుడు శంకర్ వైద్య పరమైన ఖర్చులను మెరుగైన వైద్యం నిమిత్తం అయ్యే ఖర్చులను నేను చూసుకుంటానని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నకరికల్లు మండల ఉపాధ్యక్షుడు షేక్ రఫీ సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, చిలకా పూర్ణ, చిలకా సత్యం, షేక్ ఖాసిం, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.