ఓటర్ల జాబితాపై అఖిలపక్ష సమావేశం

నూజివీడు నియోజకవర్గం: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూజివీడు తాసిల్దార్ అధ్యక్షతన నూజివీడు ఓటర్ల జాబితాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నూజివీడు నియోజకవర్గ ఇంచార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు రేవనిశెట్టి సత్యనారాయణ, నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు ముత్యాల కామేష్, జనసేన నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్, నూజివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసునూరు రాజా, బిజెపి నూజివీడు మండలం మాజీ అధ్యక్షులు లావు కుటుంబరావు చౌదరి, నూజివీడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఇంటూరి చంటి, టిఎన్ఎస్ఎఫ్ నూజివీడు నియోజకవర్గ అధ్యక్షులు తట్టుకోల శివ, నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ థామస్ తదితరులు పాల్గొన్నారు.