తిరుపతిలో జనంతో జనసేన కార్యక్రమం చేపట్టిన జనశ్రేణులు

తిరుపతి: స్థానిక గోపాల్ రాజ్ కాలనీ 17వ వార్డు వినాయకుడి గుడి పరిసర ప్రాంతాలలో శుక్రవారం “జనంతో జనసేన కార్యక్రమం నగర అధ్యక్షుడు రాజారెడ్డి, 17వ వార్డు అధ్యక్షుడు మనోజ్, సుభాషిని, హేమ కుమార్, లక్ష్మి, చందన, రాజేష్ ఆచారి, కొండా రాజమోహన్, గుట్ట నాగరాజు, కిషోర్, వినోద్, రమేష్ నాయుడు, రెడ్డి, రాహుల్, షరీఫ్, పవన్, ఆదికేశవులు, డోలా కళ్యాణ్, లీలా కృష్ణ, దినకర్ తదితరులు కలిసి ప్రతి ఇంటిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రజలు కరెంటు డ్రైనేజీ సమస్యలను నాయకులక దృష్టికి తీసుకువచ్చారు, ఈ సమస్యల పరిష్కార దిశగా సంబంధిత అధికారులను కలుస్తామని వారికి రాజరెడ్డి హామీ ఇచ్చారు. స్థానికులకు ఈసారి కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వమని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.