కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ పోస్టర్లు విడుదల

అనంతపురం జిల్లా, జనసేన పార్టీ కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో.. టీం పిడికిలి వారి గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది… పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులు 3 వేల మందికి ఒక్కొక్కరి చొప్పున లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు అండగా నిలిచారు. జనసేన పార్టీ రైతుల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అతికించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, జనసేన నాయకులు వంశీ, జకీర్, పాషా, పవన్, మహేష్, శ్యామ్, చిరంజీవి, రాజకుమార్, అరవింద్, వీరేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.