దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వీరమహిళలు
జనసేన పార్టీ మహిళా విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత నంబూరి గ్రామంలో వెలసిన దశావతార వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, అనంతపురం జిల్లా మహిళా సంయుక్త కార్యదర్శులు, వీర మహిళలు పాల్గొన్నారు.