డోర్ టూ డోర్ కంటి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి
గాజువాక నియోజకవర్గం 64వ వార్డు, యారాడ గ్రామంలో ఎస్.ఏ ఎల్.పీ.జీ వారి ఆర్థిక సహాయంతో శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో యరాడ గ్రామ ప్రజల కొరకు డోర్ టూ డోర్ కంటి స్క్రీనింగ్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, ఎస్.ఏ ఎల్.పీ.జీ సీఈఓ సంజయ్ గుహే, శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొని.. వరుసగా 10 రోజులు పాటు జరిగే డోర్ టూ డోర్ కంటి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో శంకర్ ఫౌండేషన్ ప్రతినిదులు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొనటం జరిగింది.