కొండపల్లిలో ఘనంగా పీర్లు పండుగ

  • ముస్లిం సోదర సోదరిమణులకు మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన అక్కల రామ్మోహనరావు (గాంధీ)

కొండపల్లి ఉత్సవ కమిటీ సభ్యులు ఎస్.కే సుభాని ఆహ్వానం మేరకు మొహర్రంను పురస్కరించుకుని కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఖిల్లా రోడ్డులో హజ్రత్ మౌలాలి పంజా ఉత్సవాల్లో జనసేన పార్టీ మైలవరం ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) ముఖ్యఅధితిగా పాల్గొని స్థానిక నాయకులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు, అనంతరం ఈ అన్నదానం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అక్కల రామ మోహన్ రావు (గాంధీ), జనసేన పార్టీ తుమ్మలపాలెం ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ, యర్రంశెట్టి నాని, యతిరాజుల ప్రవీణ్, దేవాబత్తుల నాగబాబు, కృష్ణ, నరేష్ , , తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా మొహర్రం వేడుకలలో బాగంగా కొండపల్లి మసీదు సెంటర్ నందు పంజా నందు మొహరం సందర్బంగా అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అక్కల రామ మోహన్ రావు (గాంధీ), అల్తాఫ్ రాజా, ఆరిఫ్, రీజ్వన్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.