తవణంపల్లిలో జనసేన పల్లెబాట

పూతలపట్టు, తవణంపల్లి మండలంలో జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ ఆదేశాల మేరకు జనసేన పల్లెబాట కార్యక్రమం మండల అధ్యక్షులు రాజశేఖర్ శివ ఈచనేరి గ్రామంలో నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి నూతన సంవత్సర క్యాలెండర్లను పంపిణీ చేసి జనసేన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. దాదాపు 50 కుటుంబాలతో కలసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపి, ఉదయ్, కిరణ్, యువరాజు, సందీప్, జ్యోతిష్, నవీన్, మని, ధనశేఖర్, దినకర్, వివేక్, శేఖర్, హేమంత్, వెంకట్ పాల్గొనడం జరిగింది.