అచ్యుత ఆదినారాయణ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కు చెందిన ఆర్యవైశ్యలు అచ్యుత ఆదినారాయణ ఇటీవల భూమి వివాదం విషయంలో ప్రత్యర్థుల చేతిలో కిరాతకంగా హత్య చెయ్యబడడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని మార్కాపురం పట్టణం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్ ఆదేశాల మేరకు పరామర్శించిన జనసేనపార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జనసేనపార్టీ మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్ మరియు జనసేన కార్యకర్తలు.