అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడూ అడ్డం కాదు

  • అభివృద్ధి పేరుతో అర్థవంతం లేని పనులు చేస్తే మాత్రం అడ్డుకుంటాం… – జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి మున్సిపల్ కమీషనర్ అమ్మి వారు కోనేరు కూడలి వద్ద రోడ్డు వైడ్నింగ్, మరియు బ్యూటిఫికేషన్ పేరుతో ఏ ఏ పనులు చేస్తున్నారో, తక్షణమే మీడియా ముఖంగా స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి అని బాబు పాలూరు డిమాండ్ చేసారు.. ఈ సందర్భంగా బాబు పాలూరు మాట్లాడుతూ ఈ కూడలిలో వై.ఎస్.ఆర్ విగ్రహం ఇదివరకే ఉన్నప్పటికీ, కూడలిలో మరొక పెద్ద విగ్రహం పెట్టాలనే ఆలోచనతో రోడ్డు వైడ్నింగ్ వంకతో గత 15 సంవత్సరాల నుంచి చెరువుగట్టుకి ఆనుకుని ఉన్న చిన్న చిన్న పాన్ షాపులు తొలగించవలసిన అవసరం ఏంటని, ఒకవేళ నిజంగా రోడ్డు వైడ్నింగ్ కోసం అదనంగా స్థలం అవసరమైతే చెరువుగట్టుకు ఆనుకుని చాలావరకు స్థలం ఉంది కనుక ప్రస్తుతం అక్కడ ఉన్న షాపుల్ని కాస్త వెనక్కి జరిపించి వారి జీవన ఆధారాన్ని పాడు చేయకుండా తగు చర్యలు తీసుకుంటారని కమిషనర్ గారికి కమిషనర్ గారిని జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.. అలాగే ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం ప్రస్తుతం ఆర్&బి మరియు పబ్లిక్ హెల్త్ వారు ఆ కూడలిలో ఏర్పాటు చేసిన సర్కిల్ మరియు త్రిభుజాకారంలో డిజైన్ చేసిన ఫౌండేషన్ ని కూడా కమిషనర్ ఫిజికల్ గా వెళ్లి పరిశీలించాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం.. ఎందుకంటే బ్యూటిఫికేషన్ పేరుతో ఆ కూడలిలో ఏర్పాటు చేసిన బహు విస్తారమైన సర్కిల్ వలన ఎక్కువ ట్రాఫిక్ డిస్టబెన్స్ మరియు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందని జనసేన పార్టీ భావిస్తుంది.. కావున మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్&బి సిబ్బంది ఈ కూడలిలో జరుగుతున్న మార్పులు చేర్పులపై తమ స్పష్టమైన ప్రణాళికను ప్రజలకు మరియు ప్రతిపక్షాలకు మీడియా ముఖంగా తేటతెల్లం చెయ్యాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన బొబ్బిలికి పేరు తెచ్చిన మన బొబ్బిలి వీణ ప్రాంగణాన్ని ఈ చెరువు గట్టు కూడలిలో ఏర్పాటు చెయ్యాలని స్థానిక ప్రజలు మరియు వీణల తయారీ కళాకారుల తరపున జనసేన పార్టీ సూచన చేసిన విషయంపై కూడా మున్సిపల్ అధికారులు లోతుగా ఆలోచన చెయ్యాలని బాబు పాలూరు విఙ్నప్తి చేసారు.