పిడుగు పాటుకు మృతి చెందిన మేఘన కుటుంబానికి జనసేన పరామర్శ

ఆముదాలవలస నియోజకవర్గం, పనుకుపర్తి గ్రామంలో ఇటీవలే పిడుగు పాటుకు మృతి చెందిన 12ఏళ్ల పాప మేఘన కుటుంబాన్ని శనివారం జనసేన నాయకులు కోరుకొండ మల్లేశ్వరావు, ఎంపీటీసీ విక్రమ్, సంగం, సంతోష్ నాయుడు, శ్రీను, ప్రసాద్, శివ్వలా సురేష్ పరామర్శించారు. మృతి చెందిన కుటుంబంలో తండ్రికి ముగ్గురు ఆడపిల్లలు అందులో రెండో పాప చనిపోవడం చాలా బాధాకరం అని జనసేన నాయకులు చెప్పారు. ఆ కుటుంబానికి త్వరలో ఆ ఊరు కార్యకర్తలతో కలిసి ఆర్థికంగా సాయంగా ఉంటాం అని పార్టీ తరుపున భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పనుకుపర్తి కార్యకర్తలు, అల్లేన గణేష్, ఆనంద్, కాసి తదితరులు పాల్గొన్నారు.