నాగబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

హిందూపురం, జనసేన పార్టీ ముఖ్య నాయకులు కొణిదెల నాగబాబు పిలుపు మేరకు మంగళవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నందు నాగబాబుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడం జరిగిందని, పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీ పార్టీలతో కలసి పనిచేసి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడంకోసం శక్తి వంచన లేకుండా కృషిచేయాలని, హిందూపురం ఉమ్మడి అభ్యర్థి బాలకృష్ణ గెలుపుకు కృషి చేయాలని, కష్టపడి పనిచేసే వారికి రానున్న రోజుల్లో పార్టీ మంచి గుర్తింపు ఇస్తుందని ఇంచార్జ్ ఆకుల ఉమేష్ తో పాటు హిందూపురం జనసేన నాయకులకు నాగబాబు భరోసా ఇవ్వడం జరిగింది. హిందూపురంలో రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా అరా తీశారు. ఇటీవల పార్టీ నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులపై ప్రత్యేకంగా అరా తీశారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సమావేశంలో హిందూపురం జనసేన నాయకులు చక్రవర్తి, కొల్లకుంట శేఖర్, చిన్నా ప్రవీణ్, లోకేష్, బాలాజీ పాల్గొన్నారు.