గొంది ప్రజల దాహార్తికి జనసేన వాటర్ ట్యాంకర్

కోనసీమ జిల్లా, రాజోలు వేసవి కాలంలో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచినీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా బుధవారం గోంది గ్రామంలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి కేశనపల్లికి చెందిన గౌరవ పెద్దలు అడబాల ఆంజనేయులు & సన్స్ వారి (ట్రాక్టర్ డిజల్ )ఖర్చులతో గోంది_జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలియచేయడం జరిగింది.