కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో జనసేనలో చేరికలు

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం బేతేలు గ్రామం ఎస్సీ కాలనీ మహిళలు యువకులు గ్రామ పెద్దలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి 30 మంది కర్నూలు జిల్లా నాయకులు పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జనసేన సేవాదళ్ మాజీ కో-ఆర్డినేటర్ చల్లా వరుణ్. కోడుమూరు నియోజకవర్గ నాయకులు లక్ష్మణ్ణ, ఆకెపోగు రాంబాబు, షాలుబాష, కృష్ణబాబు, వై రామాచంద్రులు, ఎల్లప్ప, మురళి, జాన్సన్ రాజు, పాణ్యం నియోజకవర్గ నాయకులు మంజునాథ్, వై.బజారి, బి.సుధాకర్, షబ్బీర్, సతీష్, పత్తికొండ నియోజకవర్గ నాయకులు గోవిందు మరియు గ్రామజనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.