కిరణ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన జనసేన

నెల్లూరు, రైతులు దేశానికి వెన్నుముక – ఆ రైతులకే ఈ వైఎస్సార్సీపి ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు, పండించిన పంటను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం లేదంటూ నెల్లూరు జిల్లా సంఘం తాసిల్దార్ కార్యాలయం వద్ద పెరమనకు చెందిన రైతు గూడూరు కిరణ్ కుమార్ రెడ్డి ధాన్యమును తహశీల్దార్ కార్యాలయం వద్ద పోసి నిరసన తెలిపి ఆందోళన చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అతనిని పోలీసులు అడ్డుకుని ఆసుపత్రికి తరలించగా.. నెల్లూరు లోని రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల నందు గూడూరు కిరణ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్, జనసేన పార్టీ సంగం మండల నాయకులు సతీష్, కోళ్ల సునీల్, సాయి మరియు తదితరులు పాల్గొన్నారు.