జంగాలపల్లె గ్రామంలో జనసేన భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేసిన నాయకులు

మదనపల్లె మండలం జంగాలపల్లె గ్రామం వేంపల్లె పంచాయతీలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం ఆధ్వర్యంలో మదనపల్లె జనసేన రూరల్ మండల అధ్యక్షుడు రోనూరు బాబు ఆధ్యక్షతన జంగాలపల్లెలో వారం వారం పల్లె బాటలో భాగంగా వారి పంచాయతీలో సమస్యలు అడిగి తెలుసుకుని ఆ గ్రామమలో ఎక్కువ జనసైనికులు ఉన్నారని ప్రస్తుత పాలకులు గుర్తించి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం లేదని తెలుసుకోవడం జరిగింది. మరియు రాజకీయాలు ఈ మధ్యలో వేడెక్కిన సందర్భంగా జనసైనికులు అందరూ కలిసికట్టుగా సమస్యలు పై పోరాటం చేయాలని దిశానిర్ధేశం చేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు వారికి తెలియచేసిన మండల అధ్యక్షుడు రోనూరు బాబు. ఈ సమావేశంలో సువారపు చంద్రశేఖర్, మధు, ప్రసాద్, కటారి మోహన్, చంద్రమోహన్, చంద్ర రెడ్డి మరియు జనసైనికులు పాల్గొన్నారు.