యాక్సిడెంట్ అయిన జనసైనికునికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

పుంగనూరు, జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ జనసేన కార్యకర్త చైతన్య చిత్తూరు కొత్తపల్లి వద్ద గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పిఏసి సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మరియు కార్యదర్శి పగడాల రమణ పరామర్శించి జనసేన పార్టీ యూ.ఎస్.ఏ ఎన్నారై తరుపున శ్రీమతి రంగిశెట్టి శైలజ, అనిశెట్టి స్వామి మరియు వారి మిత్ర బృందం తరుపున ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, మండల అధ్యక్షుడు విరూపాక్షి, మరియు జనసేన నాయకులు నరేష్, హరి నాయక్, చంద్ర, శీన, మురళి, బాలాజీ నాయక్, టీవీ.రమణ, జగదీష్, చౌడప్ప, మరియు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.