గుర్రాల లక్ష్మీ కి సహాయమందించిన జనసేన

పాలకొండ నియోజకవర్గం పరిధిలో గల కొండవీదిలో నివాసం ఉంటున్న గుర్రాల ఆనందరావు ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. ఆయన మరణానంతరం భర్తను కోల్పోయి పిల్లలుతో నిస్సహాయ స్థితిలో ఉన్న గుర్రాల లక్ష్మీ పరిస్థితి తెలుసుకున్న పాలకొండ పట్టణ జనసేన నాయుకులు గొర్లె మన్మధరావు ఎన్.అర్.ఐ జనసైనికులు కడ్రోతి సంతోష్ కుమార్గారికి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి మన్మధరావు ని మరియు జనసైనికులని గుర్రాల లక్ష్మీ ఇంటికి ఒక రైస్ బ్యాగ్ తో పాటుగా ఒక నెలకు సరిపడే నిత్య వస్తువులు అందజేయడం జరిగింది. గొర్లె మన్మధరావు మాట్లాడుతూ ఆమెకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాల్సివచ్చినాసరే పిల్లల పుస్తకాలకి సంబందించిన బుక్స్ అవసరమైనప్పుడు తప్పకుండా నాకు తెలియపరచండి అని గొర్లె మన్మధురావు చెప్పడం జరిగింది. మేము తప్పకుండా స్పందించి సహాయాన్ని అందజేస్తామని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ టౌన్ జనసైనికులు రామకృష్ణ, శ్రావణ్, సాగర్, శంకర్, బాబా, శివ శంకర్, శంకర్ పాల్గొన్నారు.