గర్భాన ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ అవగాహన కార్యక్రమం
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు “యరకరాయపురం” గ్రామంలో ఇటుక పని చేసుకుంటున్న కుమ్మరి వృత్తి వాళ్లకు క్రియాశీలక సభ్యత్వం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం, మరియు ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిరంతరం తపిస్తూ పార్టీలో సభ్యుల క్షేమం కోసం పెద్ద మనసుతో ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అలాగే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ.. జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్న ప్రజలకు క్రియాశీలక సభ్యులు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.