బొలిశెట్టి జన్మదినోత్సవ వారోత్సవాల సందర్భంగా పలు సేవా కార్యక్రమలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినోత్సవ వారోత్సవాలలో భాగంగా తాడేపల్లిగూడెంలో జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారోత్సవాలలో రెండవ రోజు సేవా కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ ముఖ్యఅతిథిగా స్థానిక తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ తల్లి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ముగించుకొని అనంతరం తాడేపల్లిగూడెం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పాలు ఫ్రూట్స్, బిస్కెట్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ గారి జన్మదిన వారోత్సవాల్లో నా వంతుగా సేవా కార్యక్రమాలు చేయడం, అంతేకాకుండా ప్రజలు మన్నలను పొందిన వ్యక్తి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ కరోనాలంటి విపత్కర పరిస్థితుల్లో తన వంతుగా లక్షలాది రూపాయలు ప్రజలకు నిత్యవసర సరుకులు అందజేయడంలో మన జిల్లాలో ముందున్న వ్యక్తి ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ అని అన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్, లింగం శ్రీను, అత్తిలి బాబి, బయనపాలేపు ముఖేష్, ఏపూరి సాయి, చిన్న, శ్రీను, వెజ్జు రత్న కుమారి, పెనుబోతుల సోమాలమ్మ, ముద్దాల లక్ష్మీ ప్రసన్న, కల్యాణి, మధుశ్రీ, ప్రశాంతి మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.