కోవూరు నియోజకవర్గంలో జనసేన యువ నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి పర్యటన

నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, కోవూరు మండల పంచాయతీ పరిధిలోని గుమ్మల దెబ్బ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను కోవూరు ప్రభుత్వ పాఠశాలలో గాని పాటూరు ప్రభుత్వ పాఠశాలలో గాని విలీనం చేయొద్దని గుమ్మల దెబ్బ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఆ విషయాన్ని తెలిసిన అనంతరం విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు.ఈ సమస్యను పార్టీ పరంగా కాకుండా ప్రజల పక్షాన జనసేన పార్టీ ముందుందని కోవూరు నియోజకవర్గ నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ముళ్ళ మున్వర్ బాషా, జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి మన్నేపల్లి పవన్ కుమార్, కోవూరు మండల అధ్యక్షుడు షేక్ అల్తాఫ్ ఉపాధ్యక్షులు నరాల శెట్టి మహేష్, పరిటాల వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు నల్లబల్లి సాయి కృష్ణ, పవన్ కుమార్, ప్రదీప్ కార్యదర్శులు బ్రహ్మయ్య, పవన్ కుమార్, సంయుక్త కార్యదర్శులు పెద్ది తన్మయి, నాగిశెట్టి రఘు, దారం సందీప్, కోల వెంకటేశ్వర్లు మరియు మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.