తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి నారపరెడ్డి పార్థసారధికి సన్మానం

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో ఆదివారం రామచంద్రపురం పట్టణం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా నియమించబడిన నారపరెడ్డి పార్థసారధి కి శాలువాలు, పూలమాలతో సన్మానించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పోలిశెట్టి చంద్రశేఖర్ లను శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సంపత్ కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయకుమార్, గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజ్ కుమార్, పట్టణ కౌన్సిలర్ అంకం శ్రీనివాసు, ఎంపీటీసీలు చిక్కాల స్వామి, సాక్షి శివ కృష్ణ కుమార్, జనసేన నాయకులు గొల్లపల్లి కృష్ణ, వడ్డి సత్తి బాబు, కనితి రాంబాబు, మంచెం ఈశ్వరుడు, గుబ్బల శ్రీనివాస్, కంచెర్ల వెంకటేశ్వరరావు, బోనం శ్రీనివాస్, తోట రామకృష్ణ, మట్టా దుర్గ తదితర రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.