దుర్గమ్మ కుటుంబానికి 5లక్షల చెక్కు అందజేసిన జనసేనాని

కైకలూరు నియోజకవర్గం: ముదినేపల్లి మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసేన క్రీయాశీలక సభ్యురాలి కుటుంబానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 5లక్షల రుపాయలు చెక్ అందించారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన చెన్నూరి దుర్గమ్మ అనే మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమెకు జనసేన పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి చేయూతనందించారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామ్ సమక్షంలో గురువారం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా చెన్నూరి దుర్గమ్మ కుటుంబసభ్యులు మాట్లడుతూ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి గ్రామ జనసైనికులకు ధన్యవాదములు తెలిపారు. అలానే కొత్తపల్లి గ్రామానికి ఇది రెండో చెక్ కావడంతో గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ పట్ల జనసేన పార్టీ పట్ల కృతఙ్ఞత తెలిపారు.