మాడుగుల మండలంలో జనసేనకు రోజురోజుకు పెరుగుతున్న జనాదరణ

మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలం, సాగరం పంచాయతీ డి.సురవరం నుంచి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా గెలిచిన వార్డు మెంబర్ భర్త శ్రీ గుమ్మల అప్పలనాయుడుతో పాటూ సుమారు 10 మంది శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్రావు, శ్రీ బొలిశెట్టి సత్య ల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాడుగుల అధ్యకులు రొబ్బా మహేష్, వీరా సురేఖ, రాంబాబు, సీతారాం, దయ, శివాజీ, దాసరి అచ్యుతరావు దయా యాదవ్, పాము నాగరాజు, అప్పి, చెల్లంనాయుడు మరియు దేవరపల్లి నుండి గుమ్మడి శ్రీరామ్, చీడికాడ నుండి రాము, నాయుడు తదితరులు పాల్గొన్నారు.