శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభకు జనసేన సంఘీభావం

రాజమండ్రి నగరంలో డిసెంబర్ 18 వ తారీఖున జరగబోయే శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభకు జనసేన పార్టీ తరపున రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా అనుశ్రీ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ శెట్టి బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటంలో ముందున్నారని, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేకూర్చటమే జనసేన పార్టీ లక్ష్యం అని అందులో భాగంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ గారికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రాధాన్యత కల్పించిన మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ని ఎప్పటికప్పుడు ఏ విధంగా అవకాశం వచ్చినా శెట్టిబలిజ సోదరులకి పూర్తి ప్రాధాన్యతను ఇస్తూ జనసేన పార్టీ ముందుకు నడుస్తుందని రాజమండ్రి మహానగరంలో డిసెంబర్ 18 వ తారీఖున జరగబోవు శెట్టిబలిజ ఆత్మ గౌరవ సభకు జనసేన పార్టీ పూర్తి సంఘీభావం తెలుపుతుందని అను శ్రీ తెలిపారు. ఈ సమావేశంలో తూ.గో. సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు, రాజమండ్రి నగర ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శి విన్నవాసులు తదితరులు పాల్గొన్నారు.