జనసేన పార్టీ విస్తృత సమావేశాలు

పాలకొండ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సన్ రైజ్ హోటల్లో జనసేన పార్టీ విస్తృత సమావేశంలో భాగంగా పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు పలువురు ముఖ్యనాయకుల సమక్షంలో సోమవారం పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నేతలతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు గర్భన సత్తిబాబు మాట్లాడుతూ నియోజకవర్గం లో ముఖ్యంగా తోటపల్లి ఎడమ కాలువ, జంపర్ కోట జలాశయం పూర్తి అయితే ఈ ప్రాంతం మరో కోనసీమ జిల్లాగా తయారు అవుతుందని సత్తిబాబు అన్నారు. పాలకొండ డంపింగ్ యాడ్, పాలకొండ రాజాం రహదారి, మరియు నియోజకవర్గం లో ఉన్న పలు సమస్యలను పార్టీ దృష్టికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.