నిజం గెలవాలి కార్యక్రమానికి జనసేన మద్దతు

మదనపల్లె: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ సూచనల ప్రకారం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వారితో కలసి నారవారిపల్లిలో నిజం గెలవాలి కార్యక్రమానికి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డెప్ప, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, టౌన్ జనరల్ సెక్రటరీ జవిలి మోహన్ కృష్ణ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.