దివాన్ చెరువులో వైస్సార్సీపీకి ఝలక్- జనసేనలో భారీ చేరికలు

  • జనం చూపు జనసేన వైపు

రాజానగరం: రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఆడపడుచులపై జరుగుతున్న అరాచకాలు చూసి ఈ నీచపు ప్రభుత్వంపై విసుగు చెంది, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజా క్షేమం కోసం పాటు పడుతున్న విధానం నచ్చి రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయిన 60 మంది వీరమహిళలు. వీరందరికీ బత్తుల వెంకటలక్ష్మి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దివాన్ చెరువు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.