ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్య సాహసాలే జనసేనకు ఆదర్శం: ఆదాడ మోహనరావు

విజయనగరం: వీరవనిత, ధీరశాలి, స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆద్వర్యంలో శనివారం ఉదయం స్థానిక బాలాజి జంక్షన్ వద్ద అంబేత్కర్ సామాజిక భవనంలో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి జనసేన నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని వారిపై తిరుగుబాటు చేసిన శూరురాలు, ధీరవనిత ఐన ఝాన్సీ లక్ష్మీబాయి ని నూతన రాజకీయాల్లో మార్పు తెద్దామని ఓ సంకల్పంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టారని, ఇటువంటి పార్టీలో మహిళా విభాగానికి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర వనితను ఆదర్శంగా తీసుకొని, జనసేన పార్టీ ఝాన్సీ వీర మహిళా విభాగం అని పెట్టారని ఇటువంటి వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి నీ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రవితేజ, ఏర్నాగుల చక్రవర్తి, కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, సలీమ్, కందివలస సురేష్, పిడుగు సతీష్, పత్రి సాయి, రఘు, రాజు, నాయుడు, త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.