వైసీపీ అకృత్యాలపై గవర్నర్ కు జనసేన వినతిపత్రం

విశాఖ: ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అధ్వర్యంలో జరుగుతున్న రాక్షస పాలన, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, అక్రమ భూదోపిడీలు, ఆంధ్ర విశ్వ విద్యాలయంలో జరుగుతున్న వైసీపీ పెత్తందారీతనం మరియు విశాఖలో జరుగుతున్న పర్యావరణ నాశనం వంటి అంశాల గురించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిసి వివరించి వినతి పత్రాన్ని అందించిన జనసేన పార్టీ బృందం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి రాకుండా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ తీరును అలాగే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరును ఖండిస్తూ ఇది పూర్తిగా అప్రాజస్వామికం అని తెలపడం జరిగింది. ఈ సమావేశంలో చోడవరం ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు, విశాఖపట్నం కార్పొరేటర్ శ్రీ పీతల మూర్తి యాదవ్, విశాఖ నార్త్ ఇంచార్జ్ శ్రీమతి పసుపులేటి ఉష కిరణ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శివదత్ బోడపాటి, శ్రీమతి అంగ దుర్గా ప్రశాంతి పాల్గొన్నారు.