బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనలోకి చేరికలు

  • చొప్పెళ్ళ గ్రామ పర్యటన అనంతరం వైసిపి నుండి జనసేన పార్టీలోకి మరికొన్ని చేరికలు

కొత్తపేట: ఆలమూరు మండలం, చొప్పెళ్ళ గ్రామంలో బుధవారం కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ నిర్వహించిన జనసేనకు అవకాశం ఇద్దాం.. ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం.. ప్రచార కార్యక్రమం అనంతరం గ్రామంలోని మరికొంతమంది వైసిపి పార్టీకి చెందిన నాయకులు, యువత శుక్రవారం వాడపాలెంలోని బండారు శ్రీనివాస్ గారి కార్యాలయం వద్దకు వచ్చి పార్టీలో చేరడం జరిగింది. నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో ఆకుల నాగన్న గారు తమ అనుచరులుతో కలిసి వైసిసి పార్టీ వీడి జనసేనలోకి చేరడంతో వారికి కండువా కప్పి అహ్వనించడం జరిగింది. జాయిన్ అయిన వారు ఆకుల నాగన్న, ఆకుల రామకృష్ణ, కర్రి వెంకటేష్, బోగిశెట్టి దుర్గప్రసాద్, వెల్లిశెట్టి రాజేష్, పాల్లమర్తి అంజికుమార్, అబ్బిశెట్టి సాయి, ఆకుల ధనకుమార్, దామోదర సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, తోరాటి వెంకన్న, నాగిరెడ్డి మహేష్, సోము శ్రీనివాస్, తోరాటి సత్య కిషోర్, అన్యం బంటి, కొత్తపల్లి శివ, అన్యం దుర్గరావు తదితరుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.