జనసేన పార్టీలో చేరికలు

కాకినాడ రూరల్: కాకినాడ గొడరిగుంటలోని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ స్వగృహం వద్ద ఆదివారం కాకినాడ రూరల్ మండలం, రమణయ్యపేట మరియు గైగోలుపాడు ప్రాంతాలనుండి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వైస్సార్సీపీ కార్యకర్తలు సుమారు 15 మంది జనసేన నాయకులు తాటికాయల వీరబాబు అధ్వర్యంలో పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికారు.