బత్తుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామం నుండి జనసేన నాయకులు బధిరెడ్డి వాసు మరియు వల్లభశెట్టి శేషు ఆధ్వర్యంలో ఎస్సీ సామాజిక వర్గం మరియు ఇతర వర్గ నాయకులు వారి అనుచరులతో కలిసి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడిగట్ల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.