ముదిగుబ్బ మండలంలో చిలకం మధుసూదన రెడ్డి పర్యటన

ధర్మవరం నియోజకవర్గం: ముదిగుబ్బ మండలం, ముక్తాపురం, ముక్తాపురం తాండ, నల్లాయగుంట పల్లి, నల్లచర్లోపల్లి, గుంజేపల్లి, పొడరాలపల్లి, నాగలుబ్బల గ్రామాలలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పర్యటించడం జరిగింది. నల్లచెర్లోపల్లి టిడిపి సర్పంచ్ హరి మరియు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ప్రజలు, మహిళలు తండోపతండాలుగా విచ్చేసి హారతులు, పూలదండలు, డబ్బులు, వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామాలలో పర్యటిస్తూ గ్రామ సమస్యలపై తెలుసుకుంటున్న క్రమంలో రైతు కూలీలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ వారికి మినరల్ వాటర్ ఇబ్బందిగా ఉందని చెప్పగా తప్పకుండా ప్రతి ఒక్క గ్రామానికి జనసేన-తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక
మినరల్ వాటర్ అందేలా చేస్తానని హామీ ఇచ్చి అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పనులను ప్రజలకు వివరించి ధర్మవరంలో వైసీపీని గద్దె దించి జనసేన, తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా కోరారు. అదేవిధంగా వివిధ పార్టీల నుండి పలు గ్రామాల మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున 100 కుటుంబాలకు పైగా జనసేన పార్టీలోకి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారి సమక్షంలో చేరారు. చేరిన వారి పేర్లు దేవి భాయ్, రామలక్ష్మిభాయ్, కుళ్ళయమ్మ, జయమ్మ, సంధ్య, శాంతి, లక్ష్మి, వరాలు, దేవి మరియు, గణేష్, సాయి, నాయుడు, విశ్వంత్, మధు, ఓబులప్ప, చంద్రశేఖర్, వినోద్, ఎర్రి స్వామి, రవి, రాఘవేంద్ర, కుళ్ళయప్ప, నారాయణస్వామి, వుత్తప్ప, రాజేష్, గోపాల్, నాగార్జున, చెన్నయ్య, పోతలయ్య, రాజప్ప, ఆదేప్ప, ఉపేంద్ర, తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండల కన్వీనర్ గుర్రం జయచంద్ర, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్, కోటికి రామాంజి, జిల్లా కార్యదర్శి కోన చంద్రశేఖర్, టీడీపీ నాయకులు రామచంద్ర, వెంకటరాముడు, భీముడు, రవిచంద్ర, మోహన్, నాగరాజు, తిరుపాల్, పెద్దన్న మరియు ప్యాదింది వెంకటేశ్, వడ్డే రవి, మల్లేమిద మోహన్, రామ కృష్ణా నాయక్, నారాయణ స్వామి నాయక్, హరికృష్ణ, నరేంద్ర తిరుపాల్, మధు, విజయ్ కుమార్ అనిల్ కుమార్, శ్రీరాములు, సాకే నరసింహులు, శివ శంకర్ రెడ్డి, వెంకటరాముడు, కాశప్ప, ధారా గంగాధర్, గొంగటి హరి, బాషా, బాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.