టిడిపి, వైసిపిల నుండి జనసేనలో చేరికలు

గండేపల్లి మండలం తాల్లూరు గ్రామం నుండి ఆరుగొల్లు రామిరెడ్డి గారు, యర్రంపాలెం గ్రామం నుండి బిక్కిన కృష్ణార్జున గారు మరియు ముత్యాల కాశీ గారు వారి యొక్క బంధు మిత్ర సపరివారంతో సుమారు 50 మంది ఈ రోజునశుక్రవారం జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అధ్యక్షతన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. మనోహర్ వారికి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకుని వెళ్లడానికి మీలాంటి వారు సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషంగా ఉందని, జనసేన పార్టీలో చేరినందుకు వారికి అభినందనలు తెలియజేశారు.