పంతం నానాజి సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్, జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తాటికాయల వీరబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఆంజనేయ నగర్, ఈశ్వర్ నగర్ ప్రాంతాలకు చెందిన పెద్దలు, యువకులు గళ్ళ పద్మారావు మాజీ ఉప సర్పంచ్. మరియు కుడిపూడి బాలాజీ, మాజీ వార్డు సభ్యులు నాయకత్వంలో సుమారు 50 మంది కాకినాడ గోడారి గుంటలో గల జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ స్వగృహం వద్ద ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.