శ్రీ పట్టాభిరామ స్వామి వారి మహా కుంభాభిషేకంలో పాల్గొన్న జనసేన నాయకులు

చిత్తూరులోని పైపల్లి గ్రామం పెనుమూరు మండలంలో జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి భాను ప్రసాద్ ఆహ్వానం మేరకు జరిగిన శ్రీ పట్టాభి రామ స్వామి వారి దేవాలయం మహా కుంభాభిషేకానికి విచ్చేసిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ని అలయ కమిటి సభ్యులు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలచె పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు స్వామి వారి ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా కార్యదర్సులు యస్వంత్, ఆనంద్, కలప రవి, టీడీపీ సీనియర్ నాయకులు సోమల సురేష్, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, నగర కార్యదర్శి కిరణ్ కుమార్, తిరుపతి అర్బన్ అధ్యక్షుడు మంగళం సాయి, చిత్తూరు నగర అధ్యక్షుడు సంతోష్ హరీష్, ఆరని అంజలి జనసేన నాయకులు జనసైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.