కొనసాగుతున్న 40వ రోజు రిలే నిరాహార దీక్ష

ఇచ్చాపురం, కవిటి మండల కేంద్రంలో కొనసాగుతున్న 40వ రోజు రిలే నిరాహార దీక్షలో నెలవంక గ్రామస్తులు మహిళలు, పెద్దలు యువకులు పాల్గొన్నారు. కుల ప్రతినిధులు మాట్లాడుతూ మా కుల సమస్యను గూర్చి 40రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఏ అధికారులు స్పందించక పోవటం బాధాకరం అని వ్యక్తం చేశారు. తమ కుల ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా బంగారం లాంటి తమ బిడ్డల భవిషత్ కు సరైన ఉన్నత విద్యలు కొనసాగించలేక నిరుద్యోగులుగ గ్రామాలలో చాలా కష్టంగా కూలీ పని చేస్తూ జీవనం కొనసాగుతున్నారని గోడును వెళ్ళబుచ్చరు తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. దీక్ష శిబిరానికి సర్పంచ్ కుమార్మోహన్ రెడ్డి, ఇందుసేఖర్ వర్మ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బిసాయి, మేఘనాత్ బిసాయి, సత్యన్నారాయణ, హరికృష్ణ, డిల్లేష్, నారాయణ, మోహన్, గోపి, బేదొబొరో, బృందావన్ తదితరులు పాల్గొన్నారు.