శంకర్ గౌడ్ సమక్షంలో జనసేనలో చేరికలు

తెలంగాణ, కూకట్పల్లి, కె.పి.హెచ్.బి కాలనీ థర్డ్ ఫేస్ మహారాష్ట్ర బ్యాంకు వద్ద జనసేన పార్టీలో నూతన చేరికలు జరిగాయి. జనసేన పార్టీలో 114 డివిజన్ ప్రెసిడెంట్ కలిగినీడి ప్రసాద్ మరియు బి.ఎస్.ఎన్ మూర్తి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సమక్షంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మరియు ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ నుతనంగా చేరినవారికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం అజ్రిగింది. జనసేన పార్టీలో చేరినవారిలో పి.మద్దేటి, ఏ.తాతయ్య నాయుడు, వై.కోటేశ్వరరావు, జె.ఫణి కుమార్ చౌదరి, ఆదినారాయణ, వి.వి.వెంకటేశ్వరరావు, కేబిహెచ్బి కాలనీ బైక్ మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామారావు, రాజు ప్రకాష్, నరసింహమూర్తి, సాంబశివరావు, అంజిబాబు, మాణిక్యాలరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు జె అవినాష్, సిహెచ్ సంతోష్ నరసింహారెడ్డి, కే.సుబ్బారావు, బాబ్జి, లక్ష్మణరావు, వెంకటరమణ, రజిని తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ నాయకులు మండలి దయాకర్, కొల్లా శంకర్, తుమ్మల మోహన్ కుమార్, మహేష్, కిషోర్ నాగరాజు, నాగేంద్ర, లక్ష్మణ్ రావు, సాలాది శంకర్, జీవీ కృష్ణారావు, అంజి, శ్రీనివాస్, మణి తదితరులు పాల్గొన్నారు.