ప్రజలతో మమేకమవుతున్న వేముల కార్తీక్

తెలంగాణ, కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేముల కార్తీక్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో బుధవారం జనంకోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా బుధవారం మంచికంటి నగర్లో, ప్రజలను కలిసి వల్ల సమస్యలను కొత్తగూడెం జనసేన ఇంచార్జి వేముల కార్తిక్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టౌన్ సోషల్ మీడియా సెక్రటరీ వెంకట్ ఫణి, పాల్వంచ మండలం సోషల్ మీడియా సెక్రటరీ బాషా, ప్రశాంత్, రూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.