పితాని సమక్షంలో జనసేనపార్టీలోకి చేరికలు

ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ సలాదివారిపాలెం, పొట్టి తిప్ప, పిల్లంక శివారు కొత్తలంక గ్రామానికి చెందిన సుమారు 50 మంది వైసిపి మరియు టిడిపి నుండి జనసేన పార్టీ నాయకులు మెండ శివ ఆధ్వర్యంలో జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ సమక్షంలో జనసేనపార్టీలోకి చేరారు. వారికి పితాని బాలకృష్ణ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. చేరిన వారిలో గెడ్డం వెంకటేష్, కోరాటి నందకిషోర్, ఎలిపే నాగేశ్వరరావు, కోరుకొండ శ్యామ్ కుమార్, పినమాల రామాజీ, అయితాబత్తుల వినయ్, గొల్లపల్లి వెంకటేష్, బడుగు సాయి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, గుద్దటి జమ్మి, మెండ శివ, గోలకోటి వెంకన్న బాబు, కడలి కొండ, దూడల స్వామి, మాదాల శ్రీధర్, మాదాల వంశీ, నాతి నాగేశ్వరావు, యలమంచిలి బాలరాజు, పోలిశెట్టి కృష్ణ, గాలిదేవర రాము తదితరులు పాల్గొన్నారు.