బెక్కం జనార్ధన్ అధ్వర్యంలో జనసేనలో చేరికలు

జగిత్యాల: జనసేన పార్టీ సిద్దాంతాలు నచ్చి, పార్టీ బలోపేతం చేయడానికి జగిత్యాల నియోజకవర్గం జనసేన పార్టీ కో ఆర్డినేటర్ బెక్కం జనార్ధన్ అధ్వర్యంలో యువత మహిళలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా బెక్కం జనార్ధన్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అలాగే పార్టీ సభ్యులు జనసైనికులు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు పార్టీ బలోపేతంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అలాగే నియోజక వర్గంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బొల్లి రాము, బాలు గౌడ్, జనసైనికులు హుస్సేన్, సుధీర్, విజయ్, వినీత్, సంజీవ్, వంశీ, లక్ష్మన్, రాకేష్, శివ, నవీన్, తదిరతులు పాల్గొన్నారు.