చేతికి అందొచ్చిన పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు జనసేన ఆర్థిక చేయూత

  • చేతికి అందొచ్చిన పిల్లల్ని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు జనసేన పార్టీ తరుపున ఆర్థిక సహాయం అందించిన గురుదత్

రాజానగరంనియోజకవర్గం, కోరుకొండ మండలం, దోసకాయలపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నాలుగు రోజుల క్రితం ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి సందర్బంగా పట్టీసీమ తీర్థానికి వెళ్లిన ఒలేటి అరవింద్, షేక్ లుక్మాన్, పెద్దిరెడ్డి రాంప్రసాద్ వారి స్నేహితులతో గోదావరి నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు, చేతికి అందొచ్చిన పిల్లలు కోల్పోయారని బాధలో ఉన్న కుటుంబ సభ్యులను 20వ తేదీ సోమవారం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పరామర్శించి, జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని మాట ఇచ్చారు. ఆ తల్లితండ్రులకు ఇచ్చిన మాట మేరకు బుధవరం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సేవాస్ఫూర్తితో పిల్లల తల్లిదండ్రులకు ₹15,000 రూపాయలు జనసేన పార్టీ తరుపున గురుదత్ ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలని గురుదత్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, తన్నీరు తతాజీ, కోరుకొండ మండలం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, కోరుకొండ మండల జనసేన కమిటీ ప్రధాన పోసిబాబు, చదువు ముక్తేశ్వరరావు, మండపాక మురళి, కొచ్చర్ల బాబి, చల్లా ప్రసాద్ గ్రామ జనసేన పార్టీ సభ్యులు గళ్ళ అచ్యుతరాయుడు, కందులసుబ్బారాయుడు, నావేటి ప్రసాద్, కె పవన్, శివ, తదితరులు పాల్గొన్నారు.