జనసేనలో చేరికలు

నాతవరం మండలం, లింగం పేట పంచాయతీ, బుచ్చింపేట దళితవాడ నుండి బొడ్డు సూర్య శేఖర్ ఆధ్వర్యంలో నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్యచంద్ర మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడపాటి శివదత్ సమక్షంలో, 50 కుటుంబాలు వైసిపి నుండి జనసేన పార్టీలో చేరినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్య చంద్ర మాట్లాడుతూ… గ్రామ గ్రామాన జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా 2024 ఎలక్షన్ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా గ్రామ గ్రామాన చేరికలు జరుగుతుండడం శుభ పరిణామమని, పార్టీకి వెన్నుముక యువత అని యువత తలుచుకుంటే రాష్ట్ర భవిష్యత్ నాయకులు నిర్ణయించగలరు అటువంటి యువతతోనే పార్టీ నిర్మాణం జరుగుతుందని రాబోయే రోజులలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ మరియు మండల కమిటీలతో పాటుగా గ్రామ కమిటీ బూత్ లెవల్ కమిటీలు సంపూర్ణంగా పూర్తి చేసి నిర్ణయాత్మక బలోపేతం దిశగా జనసేన అడుగులు వేస్తుంది అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు చక్రవర్తి మాట్లాడుతూ సమస్య ఎక్కడున్నా మా జనసేన అధినేత ప్రత్యేక అవుతున్నారని ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ జనసేన మాత్రమేనని తెలియజేశారు. సూర్య శేఖర్ మాట్లాడుతూ మా గ్రామంలో దళితవాడలో ఉన్నటువంటి దళితులందరూ ఏకమై రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసే వరకు శ్రమిస్తూనే ఉంటాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండలం నాయకులు మల్లాడి శ్రీను, నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఊది చక్రవర్తి, బైన మురళి, నాగరాజు, రాంబాబు, బొడ్డు సునీల్ కుమార్, అనూష, రామలక్ష్మి, మాకి రెడ్డి వెంకటరమణ, వేగి శెట్టి శ్రీనివాస్, నర్సీపట్నం గ్రామీణ నాయకులు మోపడ చిరంజీవి పాల్గొన్నారు.