స్వాతంత్ర సమరయోధులు బుద్ధవరపు సూర్యనారాయణగారికి నివాళులర్పించిన జనసేన

రాజమండ్రి సిటీ, భారతదేశ 75వ సంవత్సరం స్వాతంత్ర్య అమృత మహోత్సవం కార్యక్రమం రాజమండ్రి జనసేన పార్టీ తరుపున స్థానిక కోటిపల్లి బస్టాండ్, స్వాతంత్ర సమరయోధుల పార్కు, పాల్ చౌక్ వద్ద అప్పటి స్వాతంత్ర సమరయోధులు బుద్ధవరపు సూర్యనారాయణ గారికి జనసేన పార్టీ తరుపున ఘన నివాళులు అర్పించిన రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ అప్పటి స్వాతంత్ర్య కాలంలో బ్రిటీష్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన రాజమండ్రి వాస్తవ్యులు స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ శ్రీ బుద్ధవరపు సూర్యనారాయణ గారికి నివాళులు అర్పించడం అదృష్టం అని ఎందరో మహనీయుల త్యాగఫలం భారతదేశ స్వాతంత్ర్యం అని, ఆ పోరాటంలో సూర్యనారాయణ గారు ఉండటం నిజంగా రాజమండ్రి వాస్తవికంగా మనమందరం గర్వపడే విషయమని అన్నారు. అనంతరం బుద్ధవరపు సూర్యనారాయణ కుమారుడుకి జనసేన పార్టీ తరుపున సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర అమృతోత్సవ మహోత్సవ సమితి రాజమహేంద్రవరం చైర్మన్ శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి, కన్వీనర్లు, మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామ నాయుడు, పెదిరెడ్ల శ్రీనివాస్, పివిఎస్ కృష్ణారావు, డా.ఎస్.బి.వి తిలక్, కో ఆర్డినేటర్స్ డా.పివిబి సంజీవ్ రావు, డా.మల్లి భాస్కర్ రావు లకు జనసేన పార్టీ తరుపున అనుశ్రీ ధన్యవాదములు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు బుద్ధవరపు సూర్యనారాయణ గారికి నివాళులు అర్పించిన వారిలో రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి ఏడిద బాబి, తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు, జిల్లా నాయకులు పొన్నాడ శ్రీను, రాజమండ్రి నగర ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు పైడి రాజు, నల్లంశెట్టి వీరబాబు, సిటీ కార్యదర్శి గుణ్ణం శ్యామ్ సుంధర్, సిటీ సంయుక్త కార్యదర్శి చక్రపాణి, జనసైనికులు విక్టరీ వాసు, కుంది రాము, శ్యామ్ తదితరులు నివాళులు అర్పించారు.