పిఏసి సభ్యులు పంతం నానాజి సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ స్వగృహం వద్ద అయన సమక్షంలో కరప మండలం ఉప్పలంక గ్రామం టీడీపీ కార్యకర్తలు సుమారు 15మంది కర్రీ భైరవ స్వామి, పినపోతు కామేష్, డొక్కాడి ఉదయ్, జగతాని మెసేను, లంకడి వీరబాబు, మల్లాడి వీరబాబు, పంతాడి దుర్గారావు, పాలేపు గణేష్, కే. శ్రీను, కర్రీ ధర్మారావు తదితరులు ఉప్పలంక జనసేన నాయకులు డొక్కాడి శ్రీనివాస్, మండల అధ్యక్షులు బండారు మురళి నాయకత్వంలో నేడు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించిన పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి బోగిరెడ్డి గంగాధర్, సంగడి శ్రీనివాస్, నక్క మల్లేష్, రాము తదితరులు పాల్గొన్నారు.