పామర్రులో వైసీపీ నుండి జనసేనలో చేరికలు

పామర్రు నియోజకవర్గం, పెదపారుపూడి మండల అధ్యక్షులు కొప్పుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 50 మంది దళిత సోదరులు అధికార వైసీపీ నుంచి జనసేనలోకి రావడం జరిగింది. వారిని నియోజవర్గ ఇంచార్జి తాడిశెట్టి నరేష్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పామర్రు మండలం అధ్యక్షులు గుంప గంగాధర్, కృష్ణా జిల్లా కార్యదర్శి కాకి ఝాన్సీ, పామర్రు చిరంజీవి యువత అధ్యక్షులు సందీప్ పంచకర్ల, ఏనుగు వెంకటరత్నం, కిట్టు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.